DSC
త్వరలో డీఎస్సీ-2020
ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లే ఏటా జనవరి 1న ఉద్యోగ ప్రకటనలు ఇస్తామని, త్వరలో డీఎస్సీ- 2020 విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటన.
విశ్వవిద్యాలయాల్లోని బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడి.
అప్పటివరకు ఒప్పంద పద్ధతిలో అధ్యాపకులను తీసుకోనున్నామన్నారు.
అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
విద్యా సంస్థలను ప్రైవేటీకరించబోమని, విచ్చలవిడి ఫీజుల వసూలుపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్య.